28-06-2025 01:00:37 AM
కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకర్ గౌడ్
మొయినాబాద్, జూన్ 27:మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 155 లోని 1-.14 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలకు తొలగించిన రెవెన్యూ అధికారులు 155/అలోని 14 గుంటలను ఎందుకు వదిలేశారని కాంగ్రెస్ సీనియర్ నేత భానూరి శివశంకర్ గౌడ్ ప్రశ్నించారు.
ఈ సర్వే నెంబర్ లో ఉన్న 14 గుంటల ప్రభుత్వ గైరాన్ భూ మిని నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కొడుకు సమాధి పేరిట ఆక్రమించాడని ఆరోపించారు. చుట్టూ ప్రీకాస్ట్ గోడలు ఏర్పా టు చేసి పెద్ద గేటు పెట్టి వాచ్మెన్ ను కూడా కాపలాగా ఉంచుతున్నాడరని మండిపడ్డారు.
దీనికి ‘రోహిత్ మహరాజ్ టెంపు ల్’ అని పేరు కూడా పెట్టాడని, చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, కలెక్టర్కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకొని.. గ్రామ అవసరాలకువాడాలనికోరారు.