10-06-2025 12:00:00 AM
గద్వాల, జూన్ 9 ( విజయక్రాంతి ) : భారతదేశ విదేశాంగ విధానంలో అమెరికా పెత్తనం ఏమిటని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హా ల్ లో జిల్లా కమిటీ సభ్యులు జి.రాజు అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా విస్తృతస్థాయి స మావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య తన చొరవతోనే యుద్ధం ఆగిందన్న ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభు త్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. భారతదేశ విదేశాంగ విధానంపై అమెరికా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యు లు ఆర్ శ్రీరామ్ నాయక్, జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి జిల్లా కమిటీ సభ్యులు రేప ల్లె దేవదాస్, పరంజ్యోతి వీవీ నరసింహా, మద్దిలేటి ఉప్పేర్ నరసింహ, నర్మద, ఈద న్న, రమేష్ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.