15 April, 2026 | 12:46 AM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

10-06-2025 12:00 AM

గద్వాల, జూన్ 9 ( విజయక్రాంతి ) : ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్  కార్యాలయం సమావేశ మందిరం లో  అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, న ర్సింగరావు లతో కలిసి  జిల్లా  కలెక్టర్  దరఖాస్తులను స్వీకరించారు.

అర్జీదారుల దర ఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా  పరిశీలించి వెంటనే  పరిష్కరించుటకు  తగి న చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ  అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 52 దరఖాస్తులు అందా యని కలెక్టర్ పేర్కోన్నారు. ఈ  కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.