10-06-2025 12:00:00 AM
గద్వాల, జూన్ 9 ( విజయక్రాంతి ) : ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, న ర్సింగరావు లతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.
అర్జీదారుల దర ఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగి న చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 52 దరఖాస్తులు అందా యని కలెక్టర్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.