22-02-2026 01:48:09 AM
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయమే సురక్షితం లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపలి వెంకటరమణ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఎక్స్ వేదికగా శనివారం ఆయన ఖండించారు. ఇది మీ ప్రజాపాలనా? అంటూ నిలదీశారు. వాదనలకు రాళ్లు, దాడులతో సమాధానం ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు. నిఘా బృందాలు ఏం చేస్తున్నాయని, ప్రజాప్రతినిధికి రక్షణ లభించకపోతే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.