17-06-2025 12:00:00 AM
- రెండు రోజులు ఆగుతారా? డబ్బులు కావాలా?
- లబ్ధిదారులతో బేరం ఆడుతున్నబియ్యంమాఫియా
ఖమ్మం, జూన్ 16 ( విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా ప్రవేశపెట్టిన సన్న బియ్యంకు రేషన్ షాపు వాళ్లు రేటు డిసైడ్ చేశారు. ప్రభుత్వం అందజేసిన మొదటి రెండు నెలల్లో ఎక్కువ మంది ఈ సన్నబియ్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లి ఎంతో సంతోషించారు. దీంతో ఇక బియ్యం దందాకి తెరపడిందని అందరూ బహిర్గతం గా చర్చించుకున్నారు.
కానీ మూడవ నెలలో ఇచ్చే బియ్యంతో పాటుగా నాలుగు, ఐదు నెలల బియ్యాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రానున్నది వ ర్షాకాలం కావున ఎవరు ఇబ్బంది పడకూడదు అని మూడు నెలలకి సరిపడా బియ్యా న్ని ఒకేసారి ఇద్దామని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక్కడే మాఫియా కి ఒక మంచి అవ కాశం దక్కింది.
మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని రేషన్ షాపులు వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సం చులను లైను లో పెట్టి వారు పక్కన వేచి వున్నారు. ఖమ్మం జిల్లాలో 748 రేషన్ షాపులు ఉన్నాయి.గతంలో కొందరు రెండు, మూడు నెలలకు ఒకసారి కూడా రేషన్ తీసుకునేవారు.
ఎప్పుడైతే ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి ఇస్తుంది అని ప్రకటించారో, ఇప్పుడు మనం రేషన్ తీసుకో కపోతే ఇంకా మూడు నెలల వరకు రేషన్ రాదని అందరూ రేషన్ షాపులకి క్యూ కట్టా రు. ఇక్కడే నిద్రపోతున్న రేషన్ మాఫి యా కు అవకాశం ఇచ్చినట్టు అయింది. ఒక్కో రేషన్ షాపులో బియ్యం అయిపోవడం, సెకండ్ టైం వచ్చే వరకు కొద్దిగా లేటు కావటం ఇది ఆసరాగా చూపించి రేషన్ డీలర్లు రేషన్ కార్డు వారితో బేరాసారాలకు దిగారు.
మళ్లీ రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు మీరు డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు, కేజీకి రూ.12 నుంచి రూ.14 వరకు ఇస్తామని ప్రకటించారు. రేషన్ తీసుకుందామని వచ్చిన వారు కూడా అక్కడ ఉన్న లైన్ల ను చూసి ఒకవేళ రేపు రేషన్ వచ్చినా మనకి అందాలంటే ఒక పూటంత ఎండలో ఉండలేమని, రేషన్ డీలర్ల నుంచి కేజీకి రూ. 12 నుంచి రూ.14 వరకు తీసుకొని ఇంటి ము ఖం పట్టారు.
ఇదేదో బాగుంది అని రేషన్ డీలర్లు ఒక్కొక్కరుగా వారి వారి ప్రయత్నాలతో రేషన్ తీసుకుందామని వచ్చిన వారిని కూడా మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో జిల్లాలోని వందల రేషన్ డీలర్ల నుంచి మాఫియా కి రేషన్ చేరడంతో వారు మళ్ళీ ఇవే బియ్యన్ని మిల్లు లకు తరలిస్తున్నట్టు సమాచారం.
కొసమెరుపు ఏమిటంటే గత బియ్యానికి అన్నా ఈ బియ్యానికి ఎక్కువ రేటు వస్తుందని మాఫియా సంబరపడుతున్నదని తెలుస్తుంది. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని అందరకు రేషన్ సన్న బియ్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వారి డిలర్షిప్ రద్దు చేస్తాము
ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అందరు తీసుకోవాలని, ఎవరైనా రేషన్ షాప్ డీలర్ లు తప్పు దోవ పట్టిస్తే వారి డీలర్షిప్ రద్దు చేస్తామన్నారు. 3 నెలల బియ్యం మూడు సార్లు రేషన్ షాప్ లకు ఇస్తున్నామని ఎక్కడైనా ఆలస్యం ఐతే తమ దృష్టికి తీసుకరావాలన్నారు.
చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి