calender_icon.png 17 June, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్ మ్యాపును మార్చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు

16-06-2025 11:54:26 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanumakonda District) ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని సర్వేనెంబర్ 323లోని 1 ఎకరం 36 గుంటల భూమిలో కూడా పర్మిషన్ తీసుకుని ఫంక్షన్ హల్ నిర్మాణం చేస్తుండగా ఇరిగేషన్ అధికారులు గుగూల్ సర్వేను మార్చివేసి తప్పుడు రిపోర్టు ఇచ్చి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించారని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బాధితుడు మేరుగు రమేష్ ఫిర్యాదు చేశారు. ఎ.డి. సర్వే చేసి అన్ని ఎన్.వో.సి.లు తీసుకొని 'కుడా' వారికి డిడి కట్టి (ఫంక్షన్ హాల్ నిమిత్తం) నాకు ఎల్1. ఎల్2 పర్మిషన్ ఇచ్చినారు. సాంకేతిక లోపం కారణంగా నాకు మ్యానువల్ లేటర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పినారు.

అందుకు నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. దాదాపు వర్క్ పూర్తి అయినది. నేను హైదరాబాద్ ఇరిగేషన్ ఆఫీసుకు వెళ్ళి అధికారులను కలిసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కావున దయామయులైన కలెక్టర్ గుగూల్ మ్యాప్, ఎ.డి. సర్వే, నాలా ఆర్డర్ అన్ని పరిశీలించి తప్పుడు రిపోర్టు ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ఇఈ, ఏఈ క్రింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని, నాలా ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు తీసుకొని గ్రామానికి, గ్రామాభివృద్ధిని, రైతులను కాపాడగలరని కోరారు. నాకు కూడా న్యాయం చేయగలరని కలెక్టర్ ను ప్రజావాణిలో వేడుకున్నారు.