calender_icon.png 17 June, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను పండించాలి

17-06-2025 12:00:00 AM

కలెక్టర్ సంతోష్ 

గద్వాల్ టౌన్ జూన్ 16 : రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంటలు పండించాలని,కొత్త సాంకేతికతలను ఉపయోగించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల మండలం కొండపల్లి గ్రామ రైతు వే దికలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని కలెక్టర్ వీక్షించారు.

ఈ సందర్భం గా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతున్నదని,ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ,వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చూస్తుందని అన్నారు భూమిని సంరక్షించుకుంటూ పర్యావరణానికి హాని కలగకుండా వ్యవసాయం చేయడం ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమని కలెక్టర్ రైతు లకు సూచించారు.

వరి,పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు,పండ్ల తోట లు,వాణిజ్య పంటల సాగు,ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు సూచనలను స్వీకరించి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని కో రారు. ప్రతి మంగళవారం రైతు వేదికలలో ఉదయం10గంటల నుండి 11గంటల వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలి పారు.

ఈ కార్యక్రమాలలో రైతులు పాల్గొని నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్,మండల వ్యవసా య అధికారి ప్రతాప్,వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనూష,గద్వాల మండల తహసిల్దార్ మల్లికార్జున్ క్లస్టర్ పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.