07-06-2025 01:47:19 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు విష యంలో కేసీఆర్కు బీజేపీ ఎంపీ ఈ టల రాజేందర్ క్లీన్చిట్ ఇచ్చేలా వ్య వహరించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ఈట ల రాజేందర్ బీజేపీ ఎంపీనా లేక బీఆర్ఎస్ పార్టీ నాయకుడా? ఈ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి స మాధానం చెప్పాలని జగ్గారెడ్డి డి మాండ్ చేశారు.
‘కమిషన్ విచారణతో నీమెడకు చు ట్టుకుంటుందని కేసీఆర్తో కమిట్ అయ్యా వా? లేదంటే కిషన్రెడ్డి చెప్పాకనే కేసీఆర్తో కమిట్ అయ్యావా?’ అని జగ్గారెడ్డి నిలదీశా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కు బీఆర్ ఎస్కు ఏటీఎంగా మారిందని ప్ర ధాని మోదీ, అమిత్షాలు అన్నారని, దానికి బీజేపీ నాయకులు కట్టుబడి ఉన్నారా? లే రా? అనేది స్పష్టం చేయాలన్నారు.