31-05-2025 01:58:00 AM
సూర్యాపేట, మే 30 (విజయక్రాంతి): ఆంధ్రా మహానాడులో తెలంగాణ ముచ్చట ఎందుకని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మాజీమంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విదేశీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఘాటుగా స్పందించారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు వ్యా ఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా అబద్ధాలు చెపుతున్నారన్నారు. 2004తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందన్నారు.
2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26 వేల లోపేనన్నా రు. 2014 నుంచి ఆంధ్రలో టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గుర్తుచేసుకోవాలంటూ చురకలంటించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నంబ ర్ వన్గా నిలిచిందన్నారు. 2014 లో ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయముంటే.. కేసీఆర్ పాలనలో అది 3.70 లక్షలకు చేరింద న్నారు.
నేటికీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ 2.50 లక్షలు మాత్రమే అ నే విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలన్నారు. నిజంగా మీ పరిపాలన గొ ప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదో చెప్పాలని కోరారు. ఎనాటికైనా హైదరాబాద్ కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా అని ప్రశ్నించారు.