26-06-2025 12:00:00 AM
స్క్రూడ్రైవర్తో పొడిచి, బండరాయితో బాది హత్య
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘటన
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిందో భార్య. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లికి చెందిన సురేశ్బాబు(43), అనిత(37) దంపతులు. సురేశ్బాబు స్థానిక కల్యాణదుర్గం రోడ్డులో చిన్న హోటల్ నడుపుతున్నాడు. అతడి భార్య అనిత తొలుత ఓ హోటల్లో పనిచేసేది.
ఊరూరూ తిరుగుతూ పండ్లు విక్రయించే బాబా ఫక్రుద్దీన్(34) అనే వ్యక్తితో అనితకు రెండు నెలల కిందటే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహే తర సంబంధానికి దారితీసింది. సురేశ్బాబుకు అనుమానం రావడంతో భార్యను తాగొచ్చి వేధించేవాడు. తనను అనుమానిస్తుండటం, అదే సాకుతో వేధిస్తుండటం వంటి విషయాలన్నీ అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్కు చెప్పింది. తన భర్తను చంపితే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడిని ఉసిగొల్పింది.
ప్రతిరోజు రాత్రి హోటల్ మూసేసి తన భర్త ద్విచక్రవాహనంపై ఇంటికొస్తాడని, ఆ సమయంలో చంపాలని కుట్ర పన్నింది. ఇందుకు అంగీకరించిన బాబా ఫక్రుద్దీన్.. మంగళవారం రాత్రి రాత్రి 11 గంటల సమయంలో హోటల్ మూసేసి సదాశివ కాలనీకి బయలుదేరిన సురేశ్బాబుపై మార్గమధ్యంలో ఫక్రుద్దీన్ దాడి చేశాడు. అక్కడే అందుబాటులో ఉన్న సీసాను సురేశ్బాబుపై విసురడంతో ద్విచక్రవాహనంతో సహా కిందకు పడ్డాడు.
అతడిపై ఫక్రుద్దీన్ దాడి చేసి, తన వెంట తీసుకెళ్లిన స్క్రూడ్రైవర్తో పొడిచి, ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతపురం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, కేవలం ఆరు గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు.