26-06-2025 12:00:00 AM
సూర్యాపేట, జూన్ 25 (విజయక్రాంతి) : సుధాకర్ పీవీసీ అధినేత, కాంగ్రెస్ నాయకులు మీలా సత్యనారాయణ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల పీవీసీ కార్యాలయంలో మీలా సత్యనారాయణ 6వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పేరును దేశంలోనే గుర్తుండేలా వ్యాపారం చేస్తూ అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పీవీసీ ఎండీ మీలా మహదేవ్, నాయకులు చింతమల్ల రమేష్, కర్ణాకర్, రాంబాబు, జావిద్ బేగ్, సాయినేత, శర్మ, చంద్రమోహన్, శ్రీధర్, సుధాకర్ పీవీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుధా బ్యాంకులో: సుధా బ్యాంకు చైర్మన్ దివంగత మీలా సత్యనారాయణ వర్థంతి సందర్భంగా సుధా బ్యాంకులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు ఎండీ పెద్దిరెడ్డి గణేష్, చంద్రశేఖర్, గండూరి శంకర్, పెద్దిరెడ్డి రాజా, గాలి శ్రీను, అంజన్ ప్రసాద్, ఇరిగి కోటేశ్వరి, మధు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.