06-06-2025 12:00:00 AM
అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మార్చాలి
ఇప్పటికీ అనేకమంది రియల్టర్లుకు రైతుబంధు
ఖానాపూర్, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన భూభారతి రెవెన్యూ సదస్సు లు భూమి సమస్యలకు పరిష్కారం చూపుతోందా..? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మూడు రోజులుగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. కాగా గురువారం మండలంలోని మస్కాపూర్, రాజురా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
గురువారం మధ్యాహ్నం వరకు ఈ సదస్సులో సుమారు 12 దరఖాస్తులు రాగా వాటిలో విరాసత్, సాదా బైనామా, భూమి పట్టేదార పొజిషన్ కొరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మస్కాపూర్ పరిసర ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి రియల్టర్లు ప్లాట్లు విక్రయించగా, దశాబ్ద కాలంకు పైచిలుకు కొనుగోలు చేసిన ప్లాట్లు ఇప్పటికీ పట్టేదారు పేరు మీద నే ఉండగా, వారు వీటిపై రైతుబంధు, ఇతర ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారని దీనివల్ల ప్రస్తుతం ప్లాటు కొనుగోలు చేసిన పట్టేదారకు సమస్యగా పరిణమించే పరిస్థితి ఉం టుందని పలువురు అబిప్రాయపడుతున్నా రు.
ఈ విషయం అప్పట్లో రిజిస్ట్రేషన్ అనంతరం రెవెన్యూ శాఖ మ్యూటేషన్ చేసిన ప్పటికీ సర్వే నెంబర్ల నుంచి భూమి కేటాయింపు జరగకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని, సదస్సులో బాధితుడు సకారం శ్రీనివాస్, జన్నారపు శంకర్ ,అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అధికా రులు సర్వే నెంబర్లను పరిశీలించి అగ్రికల్చర్ భూములను కమర్షియల్ భూములుగా మార్చి కొనుగోలు దారులకు సమస్య పరిష్కరించాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఇక్కడి భూములన్నీ సర్వే నెంబర్లతో సహా అధికారుల దృష్టిలో ఉన్న మ్యూటేషన్ జరిగినప్పటికీ ,భూ కేటాయింపు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో లబ్ధిదారులు సమస్యలు ఎదుర్కోవచ్చునని పలువురు రైతులు అభిప్రాయం పడ్డారు.