05-06-2025 11:11:42 PM
మాజీ ఎమ్మెల్యే రాజయ్య..
జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళంపల్లి రాజు అధ్యక్షతన సోషల్ వాయిస్ ఫౌండేషన్(Social Voice Foundation) ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య(Former MLA Rajaiah) పాల్గొని మొక్క నాటాడు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ... సోషల్ వాయిస్ ఫౌండేషన్ మొదటి కార్యక్రమం మొక్క నాటి ప్రయాణించడం ఎంతో సంతోషదాయకం అని, మంగళంపల్లి సారధ్యంలో ఫౌండేషన్ గొప్పగా ఏదుతుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు భాగ్యలక్ష్మి, ఎన్ ఎమ్మార్ గార్డెన్స్ చైర్మన్ రాంరెడ్డి, కర్ణాకర్, విఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నల్లా రాహుల్, JAC నాయకులు తుంగ కౌశిక్, శ్రీహరి, చిటుకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.