calender_icon.png 19 June, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదస్సులోనైనా సమస్యలు పరిష్కారమయ్యేనా?

19-06-2025 12:44:26 AM

  1. భూభారతి పైనే రైతుల ఆశలు మండలంలో 1002 దరఖాస్తులు.
  2. సాదాభైనమా, ప్రభుత్వ భూముల కొనుగోలు దరఖాస్తులు అధికం

వేములపల్లి, జూన్ 18 : గత ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ ను ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ లో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిం ది. గతంలో పేరుకుపోయి ఉన్న భూమికి సంబంధించిన భూమికి సంబంధించిన సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని భూ యజమానులు ఆశిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్తులు నిర్వహిస్తుంది. రెవె న్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను చూస్తే మండలం లో భూ సమస్యలు భారీగా ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుంది. సాదా బైనమా, ప్రభుత్వ భూముల గురించి,సర్వే నెంబర్లు దొర్లిన తప్పులు, వారసత్వ పట్టాల మార్పులపై తదితర అంశాలపై  దరఖాస్తులు వచ్చినట్లు తహసిల్దార్ తెలిపారు.

వేములపల్లి మండలంలో 12 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈనెల మూడవ తారీకు నుండి 19వ తారీకు వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. మండలంలో 18 వా తారీకు వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 1002 దరఖాస్తులు వచ్చాయి. మూడు నుంచి 19 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. కొందరు ఈ సదస్సులో దరఖాస్తులు చేసుకోలేకపోయా రు.

వారు ఎందుకు దరఖాస్తు చేసుకో లేకపోయారో తెలియదు కానీ సదస్సులకు భారీగానే దరఖాస్తులు వచ్చా యి. వేములపల్లి మండలంలోని రైతులు సదస్సుల ద్వారా దరఖాస్తులు ఇవ్వలేకపోతే దరఖాస్తులు నింపి నేరుగా కార్యాలయంలోని అధికారులకు ఇవ్వచ్చు.

ఈనెల 20 వరకు దరఖా స్తులు ఇచ్చేందుకు సమయం ఉండడంతో భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టను న్నట్లు సమాచారం. విచారణ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

రైతులకు పరిష్కారం దొరికేనా?

తమ భూములకు సంబంధించిన సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు ఇచ్చిన రైతులు తమ సమస్యకు ఈసారైనా పరిష్కారం లభిస్తుందా! లేదా? అని చర్చించుకుంటున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న పరిష్కారం లభించకపోవడంతో ఈసారి భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.