29-06-2025 01:07:36 AM
జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ధర్నా
హైదరాబాద్,సిటీ బ్యూరో జూన్ 28 (విజయక్రాంతి): అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మారుస్తూ ప్రభుత్వం ఆ క్యాంటీన్లకు ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’గా పేరు మార్చాలని నిర్ణయించడంపై బీఆర్ఎస్ పార్టీ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసింది. సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిం చారు. దీంతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీనివాస్ యా దవ్ మాట్లాడుతూ.. నాటి సీఎం కేసీఆర్ రూ.5కే నాణ్యమైన భోజనం అందించేందుకు ‘అన్నపూర్ణ’ క్యాం టీన్లు ప్రారంభిస్తే ఇప్పుడు పేరు మార్చడం దారుణమన్నారు.
అన్నపూర్ణ తల్లి పేరు పెడితే.. మీరేం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 150 క్యాంటీన్లలో ఇప్పటికే 20 మూతపడితే పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు పేర్లు మార్చడంపై చూపిస్తున్న శ్రద్ధ పాలనపై చూపాలని హితవు పలికారు.