29-06-2025 01:08:45 AM
సింగన్న కూడా ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ
నవంబర్ 14న వెయ్యి సైకిల్లు పంపిణీ చేస్తాం
గజ్వేల్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పి డి జి రవి వడ్లమాని అన్నారు. వచ్చే నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా వెయ్యి సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం ములుగు మండలం సింగన్నగూడ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్, హెల్ప్ టు నీడి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీలు, బూట్లు గతంలో అందజేయడం జరిగిందని వివరించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులు అందించాలనే లక్ష్యంతో హ్యాపీ స్కూల్స్ పేరున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నా నేస్తం నినాదంతో కోటి మొక్కలు నాట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదవాలని అప్పుడే భవిష్యత్తులో లగ్జరీ లైఫ్ మీ దరి చేరుతుందని వెల్లడించారు.
అనంతరం హెల్ప్ టు నీడి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సి ఎస్ మహేష్ రావు మాట్లాడుతూ సింగన్నగూడ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీజీలు రాజ్యలక్ష్మి, హనుమంత రెడ్డి, క్లబ్ చైర్మన్లు కొడాలి చంటి, దాస జగదీశ్వర్, కుంట కరుణాకర్ రెడ్డి, బాబు గౌడ్, క్లబ్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సాయి రెడ్డి, డిసిసిబి జిల్లా డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రహీం, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి బాలకృష్ణ, రోటరీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ ఆనంద్ రెడ్డి, కడపల నరసింహారెడ్డి, సందుగారి నరసింహారెడ్డి, క్లబ్ సభ్యులు బట్టు అంజిరెడ్డి, బాలకృష్ణ, బాలరాజు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.