10 April, 2026 | 5:19 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

నాలుగోసారి వస్తామో..? రామో?

24-09-2024 01:01 AM
  1. ఏదేమైనా రాందాస్ మంత్రిగానే ఉంటారు..
  2. తోటి కేంద్ర మంత్రిని టీజ్ చేసిన గడ్కరీ

ముంబై, సెప్టెంబర్ 23:  ‘మా ప్రభుత్వం నాలుగో సారి అధికారంలో వస్తుందో రాదో చెప్పలేం.. కానీ రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం కచ్చితంగా ఉంది’  అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటిమంత్రికి చమక్కు విసిరారు. తాజాగా నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇలా వేదికపై నవ్వులు పూయించారు. ఇదే వేదికపై ఉన్న రాందాస్ అథవాలే సైతం ఉండగా.. ఆయన కూడా జోక్‌కు చిరునవ్వులు చిందించారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం జోక్ లాగానే భావించాలని గడ్కరీ చెప్పడం కొసమెరుపు.

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నేత రాందాస్ అథావాలే వరుసగా మూడోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ మరోసారి గెలిస్తే మరోసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. మహారాష్ట్ర మహాయుతి కూటమిలో ఆర్పీఐ కూడా ఓ భాగం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆర్పీఐ పార్టీ సైతం ఎన్నికల్లో పోటీ పడుతున్నది.