calender_icon.png 11 June, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జాదారుడిని సమర్థిస్తారా? లేక సస్పెండ్ చేస్తారా?

19-05-2025 12:20:28 AM

  1. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై  కేసీఆర్, కేటీఆర్‌లు వెంటనే  చర్యలు తీసుకోవాలి

కబ్జాలకు సంబంధించిన ఆధారాలను వెల్లడించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి, మే 18 ( విజయక్రాంతి ) :భూ కబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ని సమర్థిస్తారా లేక సస్పెండ్ చేస్తారా, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తో పాటు వెంటనే చర్యలను తీసుకోవాలని  బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కే సి ఆర్, వర్కిం గ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ లను వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి డి మాండ్ చేశారు.

ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం, చందూర్ గ్రామం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బినామీల పేర్ల పై పై సర్వే నెంబర్ 57 లోని 2ఎకరాల 19 గుంటలు భూమిని భూ ఖబ్జా నిజమేనని నిర్ధారణ కావడం తో రెవెన్యూ శాఖ అధికారులు  అక్రమణదారులకు నోటీసు లు జారీ చేశారని  ఎమ్మెల్యే తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సేవ్ వనపర్తి-చేంజ్ వనపర్తి నినాదం తో ఆత్మగౌరవం కాపాడుకునేందు కు తనకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీ తి, భూకబ్జాలను నిరూపించడంలో భాగం గా విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ డైరెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెం ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గద్వాల్ జిల్లా కలెక్టర్ సూచనతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు సర్వే నిర్వహించి హద్దు లు ఏర్పాటు చేశారన్నారు.

తాను కబ్జాలకు పాల్పడలేదని ఎన్నికల ముందు నిరూపించాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి నిరం జన్ రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు ఎప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత దూషణలకు దిగిన తాను ఎన్నడూ ఎదుటి వ్యక్తి పై వ్యక్తిగత దూషణలకు దిగలేదని స్పష్టం చే శారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మా ణం కు రూ 22 2400 కోట్లు ఖర్చు చేసి ఒ క్క ఎకరానికి చుక్క నీరు అందలేదని ఎ మ్మె ల్యే విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంబై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకుంటున్న బి ఆర్ ఎస్ నాయ కులు తాను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రూ 2700 కోట్లు విడుదల చేయిస్తాను పూర్తి చేసి చూపాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పీసీసీ  సభ్యులు శంకర్ ప్రసాద్,  జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య,  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.