27 June, 2026 | 7:47 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ప్రేమను ఒప్పుకోలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి మహిళ మృతి

06-04-2025 07:02 PM

చేగుంట (విజయక్రాంతి): తల్లిదండ్రులు ప్రేమను ఒప్పుకోలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వరలక్ష్మి(18) గత రెండు సంవత్సరాల నుండి బోనాల గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇట్టి ప్రేమను వరుస కాదని వరలక్ష్మి తల్లిదండ్రులు, అక్క బావలు రెండు నెలల క్రితం మందలించారు. తన ప్రేమను ఒప్పుకుంటలేరని మనస్థాపం చెందిన వరలక్ష్మి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.

ఇంటిపక్క వారు చూసి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వెంటనే వారు వచ్చి వరలక్ష్మిని నార్సింగ్ చారి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్య నిమిత్తము మేడ్చల్ లోని సంప్రదా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.