17 April, 2026 | 10:06 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రేమను ఒప్పుకోలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి మహిళ మృతి

06-04-2025 07:02 PM

చేగుంట (విజయక్రాంతి): తల్లిదండ్రులు ప్రేమను ఒప్పుకోలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామంలో చోటుచేసుకుంది. వరలక్ష్మి(18) గత రెండు సంవత్సరాల నుండి బోనాల గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇట్టి ప్రేమను వరుస కాదని వరలక్ష్మి తల్లిదండ్రులు, అక్క బావలు రెండు నెలల క్రితం మందలించారు. తన ప్రేమను ఒప్పుకుంటలేరని మనస్థాపం చెందిన వరలక్ష్మి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.

ఇంటిపక్క వారు చూసి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వెంటనే వారు వచ్చి వరలక్ష్మిని నార్సింగ్ చారి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్య నిమిత్తము మేడ్చల్ లోని సంప్రదా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.