28 June, 2026 | 12:14 PM

Breaking News

సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •  

లైంగిక వేధింపులతో ఆసుపత్రి వార్డులో మహిళ మృతి

26-06-2025 01:34 PM

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక వేధింపులకు గురై చికిత్స పొందుతూ మరణించిన మహిళపై ఢిల్లీ పోలీసులు(Delhi Police) దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన గురించి అనుమానితులన, ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించడానికి ఉస్మాన్‌పూర్ ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ ఉదయం ఈశాన్య ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. దేశ రాజధాని అంతటా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించడంలో పోలీసు బృందానికి సహాయం చేయడానికి ఆసుపత్రి పరిపాలన నలుగురు సభ్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో(Jag Pravesh Chandra Hospital) 23 ఏళ్ల మహిళపై మరో రోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. బుధవారం జిటిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు.

జూన్ 23న న్యూ ఉస్మాన్‌పూర్ స్టేషన్‌లో(New Usmanpur Station) లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిరాశ్రయులైన మహిళ జూన్ 21న జెపిసి ఆసుపత్రిలో చేరింది. జూన్ 23న ఆమె వార్డు బయటకు వెళ్తుండగా, ఆసుపత్రిలో మరొక రోగి ఆమెను లైంగికంగా వేధించాడని, ఆ తర్వాత ఆమెను జిటిబి ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆ తర్వాత పోలీసులు 23 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై దాడి అభియోగం మోపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాశ్రయులైన ఒక మహిళపై లైంగిక దాడి జరిగి, ఆమె మరణించడం నగరవాసులను దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురిచేసింది. ఈ దారుణ మరణంపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దారుణమైన సంఘటనపై ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్, ఎక్స్ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.