వజ్జపల్లిలో తాగునీటి కటకట
16-03-2026 11:53 AM
రోడ్డు ఎక్కినా మహిళలు
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని వజ్జపల్లి గ్రామంలో తాగు నీరు రావడం లేదని మహిళలు రోడ్డు ఎక్కారు. గ్రామంలోని ఎనిమిదో వార్డు లో గత మూడు రోజుల నుండి నీళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉందని వెంటనే సమస్య పరిస్కారం చేయాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందాలతో రోడ్డు పై బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారం కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.




