calender_icon.png 18 June, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా రాణించాలి

18-06-2025 05:18:22 PM

మున్సిపల్ కమిషనర్ రాజలింగు..

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజాలింగు(Municipal Commissioner Thungapindi Rajalingu) కోరారు. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ప్రదర్శనను బుదవారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రారంభించి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వినూత్న వ్యాపారాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని, అంతే కాకుండా పలువురికి ఉపాధి కల్పించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకార్లు రుణాలను అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని సూచించారు.

ఈ సందర్భంగా మెప్మా స్వయం సహాయక సంఘాలు స్వయంగా తయారు చేసిన దేశీ నెయ్యి, పచ్చళ్ళు, స్వీట్స్, బుట్టలు, మగ్గం వర్క్ మెటీరియల్, గోవు పేడతో చేసినటువంటి ఉత్పత్తులు, వేస్ట్ మెటీరియల్ తో చేసినటువంటి ఉత్పత్తులు, వెదురు, వైరు బుట్టలను ప్రదర్శించి అమ్మకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, మెప్మా టిఎంసి రఘురాం, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీ రాజు, జూనియర్ అసిస్టెంట్ వసంత్, రాజ్ కుమార్, పట్టణంలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.