10-06-2025 12:36:44 AM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలి అని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మునగాల, మోతే, నడిగూడెం, చిలుకూరు మండలాలకు సంబంధించిన రూ.76.93 లక్షల విలువైన 244 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, సంతోష్ రెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
కోదాడ జూన్ 9 : పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మి కులకు రైన్ కోట్లు, గ్లౌజులు, దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు అందించాలన్నారు. కోదాడలో రూ.250 కోట్లతో త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.