09-08-2024 02:29:20 AM
కర్ణాటక పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): కర్ణాటక, ఏపీ మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని, రెండు రాష్ట్రా ల అధికారులు, పాలకులు కలిసి పనిచేస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గురువారం బెంగళూ రులో సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖండ్రేతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏనుగుల సమస్య అధికంగా ఉందని, దీనిని పరిష్కరించేందుకు తగిన సహకారం అందించడం సంతోషంగా కలిగించిందన్నారు.
తాము ఏడు అంశాలపై చర్చించామని, ఏపీ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా కర్ణాటక ప్రభుత్వం రూ. 140 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుకుంటుందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపా రు. అటవీ సంపద రక్షణ కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశం పై విస్తృతంగా చర్చించామని, ఉపగ్రహ ఆధారిత నిఘా పెట్టి పూర్తిస్థాయి సేవలు వినియోగించుకునే అవకాశాలను భవిష్యత్తులో తీసుకొస్తామని చెప్పారు. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు కర్ణాటక నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని, వీరికి అవసరమైన యాత్రి సదన్ నిర్మాణాల కోసం భూములు కేటాయించాలని సీఎం సిద్దరామయ్య కోరినట్టు తెలిపారు. దీనిని సీఎం చంద్రబాబుతోపాటు మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్తాలని వెల్లడించారు.
స్మగ్లింగ్లపై సినిమాలపై ఆగ్రహం
రాష్ట్రంలో 40 ఏళ్ల క్రితం సినీనటులు అడవులను కాపాడేలా సినిమాలు తీసేవారని, కానీ ఇప్పడు అదే నటులు అడువుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే సినిమాలు తీస్తున్నారని పవన్కల్యాణ్ మండిపడ్డారు. ప్రస్తు తం సినిమా పరిస్థితి ఈవిధంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.