౩ నుంచి ప్రపంచ తెలుగు మహా సభలు
జనవరి 5న హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్
అమరావతి, డిసెంబర్ 27: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో వచ్చే జనవరి 3, 4, 5 తేదీల్లో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో ౩వ ప్రపంచ తెలుగు మ హా సభలు జరగనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడవ రోజు జనవరి 5 వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక ఆంధ్ర మేవ జయతే, అలాగే 3 వ ప్రపంచ తెలుగు మహా సభల పోస్టల్ కవర్ ను చంద్రబాబు విడుదల చేస్తారని సమన్వయ కర్తలు పి. రామచంద్ర రాజు, వాసిరెడ్డి విద్యా సాగర్లు తెలిపారు.




