calender_icon.png 7 June, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్‌కు 11 ఏళ్లు

05-06-2025 12:36:50 AM

శంషాబాద్ ఎలైట్ హోటల్‌లో జిల్లా కార్యశాల

రాజేంద్రనగర్, జూన్ 4: రంగా రెడ్డి జిల్లా జిల్లా కార్యశాల సమావేశం శంషాబాద్‌లోని ఎలైట్ హో టల్ లో బుధవారం ఏర్పాటు చేశారు. ప్రధాన మం త్రి నరేంద్రమోదీ పరిపాలనకు నేటి తో 11 ఏళ్ళు పూర్తి అయినది. 11 ఏళ్ళలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన,పేదల సంక్షేమంకు 11 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా రాబోయే కాలంలో బీజేపీ అభివృద్ధి గురించి చర్చించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, కమ్మరి భూపాల్ చారి,కక్కునూరి వెంకటేష్ గుప్తా, కందురీ మనోహర్ రెడ్డి,శేరి విష్ణువర్ధన్ రెడ్డి,అధ్యక్షులు హారిభూషన్ పటేల్,చిట్టం లక్మి కాంత్ రెడ్డి, రాజు, అరవింద్, మహేందర్ రెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి,బోయ కుర్మయ్య,పసుపుల ప్రశాంత్, శ్రీనివాస్ చారి తదితరులుపాల్గొన్నారు.