05-06-2025 12:39:57 AM
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా
ఘట్ కేసర్, జూన్ 4 (విజయక్రాంతి) : ప్రతి విద్యాసంస్థలో మత్తు పదార్థాలను నివారించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీ కాంత్ సిన్హా పిలుపునిచ్చారు. ఘట్కేసర్ మున్సిపల్ కొండాపూర్ లోని సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో పాలిటెక్నిక్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు బుధవారం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీ కాంత్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈవేడుకలో 450 మంది గ్రాడ్యుయేట్లు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతి థిశ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ ‘స్కిల్అప్స్కిల్రీ స్కిల్‘ అనే మూలసూత్రాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని సూచించారు.
అలాగే ఐఐటి లతో కలిసి నిర్వహిస్తున్న ఏఐ (కృత్రిమ మేధస్సు) సమ్మర్ ఇంటర్న్షిప్ అవకాశాల గురించి వివరించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా ఆయన ‘డ్రగ్ ఫ్రీ క్యాంపస్ ఆల్ ఓవర్ తెలంగాణా‘ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. విద్యార్థుల వాలంటీ ర్ సహకారంతో ప్రతి విద్యాసంస్థలో మత్తు పదార్థాలను నివారించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన వేల్పూరి చక్రవర్తి మాట్లాడుతూ పరిశ్ర మలలో ఉన్న అవకాశాలను వివరించి విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.ఈకార్యక్రమంలో సంస్థ చై ర్మన్ ఎ.వి. రమణరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మల్లాది రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కె. శివకేశవరెడ్డి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.