21-06-2025 04:47:47 PM
గద్వాల టౌన్: యోగా దినోత్సవం సందర్బంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, ఇండోర్ స్టేడియం, స్మృతి వనం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) వేరువేరుగా నిర్వహించారు. యోగా దినోత్సవంలో ఎస్పి టి.శ్రీనివాసరావు, డి.ఎస్.పి మొగులయ్య, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి యోగా ద్వారా మన శరీరాన్ని శుద్ధి చేసి, మంచినే ఆచరిస్తూ అమూల్యమైన ఫలితాన్ని పొందవచ్చని యోగా అనేది కేవలం వ్యాయామం కాదని ఇది మన శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకు ప్రశాంతతను ఇచ్చే మార్గమని అన్నారు. యోగా చేయడం ద్వారా మన జీవితానికే కొత్త దారి తెరుస్తుందని ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేసేందుకు సమయాన్ని కేటాయించాలని సూచించారు.