06-06-2025 12:00:00 AM
అన్నిరంగాల ప్రముఖులపై బయోపిక్స్ తీయడం ఇటీవల చిత్ర పరిశ్రమలో ట్రెండ్గా మారింది. ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ జీవితం కూడా వెండితెరపైకి వస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదైన పాలనతో మెప్పిస్తున్న యోగి జీవిత విశేషాలతో సినిమాను గతంలోనే ప్రకటించారు. ‘అజేయ్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ అనే పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్ గ్లింప్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది.
రవీంద్రగౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ను సామ్రాట్ సినిమాటిక్స్ బ్యానర్పై రీతూ మెంగి నిర్మిస్తున్నారు. ఇందులో అనంత్ జోషి టైటిల్ రోల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ బయోపిక్కు సంబంధించి అప్డేట్ వచ్చింది.
గురువారం యోగి ఆదిత్య నాథ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ సినిమాను 2025 ఆగస్టు 1న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ఇండియా వైడ్ రిలీజ్ కానుందీ సినిమా.