calender_icon.png 7 June, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పాట బాలకృష్ణ అభిమానులకు అంకితం

06-06-2025 12:00:00 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లక్ష్మీనరసింహా’ చిత్రం మరోసారి థియేటర్లలో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలైన ప్రేక్షకాదరణ పొందిది. ఈ చిత్రాన్ని 4కే వెర్షన్‌లో జూన్ 8న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్‌లో కొత్త పాట యాడ్ చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు.

స్వరాగ్ కీర్తన్ పాడిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ మాట్లాడుతూ.. “ఆడియో లేని ఈ సాంగ్‌కి ఏదైనా చేద్దామని నిర్మాత సురేశ్ అన్నప్పుడు నేను అసాధ్యం అని చెప్పాను. ఆయన, చంద్రబోస్, భీమ్స్ కలిసి ఈ అద్భుతం చేశారు. ఇళయరాజా ఇలాంటి ఒక ప్రయోగం చేశారని ఎప్పుడో విన్నా.

అయితే అది కూడా ఒక మాంటేజ్ సాంగ్. కానీ ఒక డాన్స్ బీట్ నెంబర్ కి ఇలా చేయడం అనేది వెరీ వేర్‌” అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం షూట్ చేసిన ఓ పాటను రీరిలీజ్‌లో యాడ్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో నెగిటివ్ దొరికింది. సౌండ్ లేదు. ఓన్లీ పిక్చర్ ఉంది. చంద్రబోస్, భీమ్స్ ఆ ప్రయత్నాన్ని అద్భుతంగా చేశారు” అన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘నా 31 ఏళ్ల సినీ సాహిత్య ప్రయాణంలో అతి విచిత్రమైన విన్యాసం చేసిన పాట. ముందు ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట స్థానంలో మరో పాటను చిత్రీకరించి, సినిమాలో పెట్టారు. ముందు చిత్రీకరించిన పాట అలానే ఉండిపోయింది. నేను మొదట ఆ పాట చూడగానే అసాధ్యమనిపించింది.

కానీ ఇలాంటి అసాధ్యాన్ని చేస్తే మనం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఒక మధురమైన ఘటనగా నిలిచిపోతుంది అని ఆలోచించి మెల్లమెల్లగా తాళం లయ టెంపోని డీకోడ్ చేసుకుంటూ వచ్చాను. అలా రాసిన పాటకు ఒక్క అక్షరం కూడా మార్చకుండా ట్యూన్ చేసి అద్భుతంగా పాటను కంపోజ్ చేశాడు భీమ్స్. ఈ పాటను బాలయ్యబాబు అభిమానులకు అంకితం ఇస్తున్నాం’ అన్నారు.