calender_icon.png 7 June, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలే!

07-06-2025 01:18:22 AM

  1. ఒక్క డీఏను ప్రకటించేందుకు 5 గంటలు క్యాబినెట్ మీటింగ్
  2. రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన కొనసాగుతున్నది
  3. బీజేపీ జాతీయ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ఐదు గంటలపాటు కొనసాగిన క్యాబినెట్ సమావేశంలో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని.. ఉద్యోగులు ఐదు డీఏలు అడిగితే, ఒక్క డీఏ ఇవ్వడం సిగ్గు చేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురా లు, ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. ఒక్క డీఏ అంటూ ఉద్యోగులను అవమానించారన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మిగిలిన డీఏలను ప్రకటించాలని అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ భరోసా కార్యక్రమానికి వచ్చిన ఎంపీ డీకే అరుణ, ఆయా సమస్యలపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పర్సెంటెజీల పాలన నడుస్తోందని, 30 శాతం కమీషన్ చెల్లిస్తే గానీ పెం డింగ్ బిల్లులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓ గొలుసులాగా అవినీతి జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుల కుటుంబాలన్నీ అదే పనిలో ఉన్నాయని ఆరో పించారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లపై తా ము ముందే చెప్పామని, రాహుల్‌గాంధీ మొదలు, రేవంత్‌రెడ్డి వరకు ముడుపులు అందుతున్నాయని డీకే అరుణ తెలిపారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు టెండర్లు వేయడానికి కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే పరిస్థతి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రం లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

పెండింగ్ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి కాం ట్రాక్టర్లను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు గతం లో పెద్దఎత్తున పనులు చేసి నష్టపోయారని, వారి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి.. 

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎంపీ డీకే ఆరుణ డిమాండ్ చేశారు.  పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సమీక్ష చేపట్టి, సొంత జిల్లాపై దృష్టి సారించాలని సూచించారు.  ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌పై రివ్యూ చేయాలన్నారు.

నెట్టెంపాడు కింద ఉన్న గూడెందొడ్డి కేపాసిటీ పెంచుతున్నట్టు తెలిసిందని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఎంపీ అరుణ తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకొని రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. అలంపూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని డిమాండ్ చేశారు.