2 May, 2026 | 8:55 PM

Breaking News

తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •  

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

07-11-2024 10:45 AM

రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ప్రేమ విఫలమై తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ కు చెందిన సాయికుమార్ చదువుకుంటూ స్థానికంగా ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ప్రేమ విఫలమయిందని తీవ్ర మనస్తాపం చెందిన అతడి బుధవారం అర్ధరాత్రి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు గురువారం ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.