calender_icon.png 23 June, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

23-06-2025 12:30:48 AM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్, జూన్ 22 : ఆమనగల్ మండల కేంద్రంలో ని సూర్యలక్ష్మి కాటన్ మిల్ ముర్తోజపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. ప్రమాదంలో ముర్తుజ పల్లి కి చెందిన యువకుడు కాలే మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమనగల్ నుంచి ముర్తుజపల్లి కి బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

అదే సమయంలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఘటన తెలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆగారు. అక్కడే ఉన్న పోలీసులను రోడ్డు ప్రమాదం గురిం చి ఆరా తీసి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా ఎమ్మెల్యే రూ.5000, కాంగ్రెస్ నాయకుడు నిట్ట నారాయణ లు రూ. 5 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

రోడ్డు ప్రమాదాలపై పోలీసులు, ఆర్టిఏ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రమాదంలో మృతి చెందుతుండడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు చోటుచేసుకున్న వాహనాదారులు రోడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని కోరారు.

హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి విస్తరణ పనులతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్కు పడుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో పనుల కోసం పలుసాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన హామీని ఇచ్చారు.