23-06-2025 12:29:13 AM
నిరుపేద అమ్మాయి గుండె చికిత్సకు రూ.5లక్షల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి,జూన్ 22: పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రేస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని కల్వకుర్తి ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అం దుకనుగున్నంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథ కం ద్వార ఎంతో మంది నిరు పేదల వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు.
తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన ఎండి ఆరీఫ్ కూతురు సమ్రీన్ బేగం గుండె సంబదిత సమస్యతో భాదపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళింది.పరిక్షించిన డాక్టర్లు గుండెకు ఆపరేషన్ చేయాలని అందుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.నిరుపేదలైన వారు అంత డబ్బులు వెచ్చించి కూతురుకు చికిత్స చేయించలేరని స్థానిక కాంగ్రేస్ నాయకుల ద్వారా ఎమ్మెల్యే నారాయణరెడ్డిని కలిశారు.
స్పందించిన ఎమ్మెల్యే సమ్రీన్ బేగం గుండె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార రెండు విడుతల గా రూ.10 లక్షలు మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసి చెక్కును ఆదివారం స్థానిక నాయకులతో కలిసి భాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ నిరుపేద ప్రజలు ఆర్థికంగా లేక అనారోగ్యంతో ఏ ఒక్కరు కూడా చనిపోకూదనే ఉద్ద్యేశంతో కాంగ్రేస్ పార్టీ నాయకుడు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిందే ఆరోగ్యశ్రీ పథకమని ఎమ్మెల్యే గుర్తు చేశారు .
ఈ పథకం ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలను కాపాడిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు.అదేవిధంగా రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేసి ఆదునీకరించి కార్పొరేట్ వైద్య చికిత్సలు అందించే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.
అనంతరం మాడుగుల మండలంలోని అందుగుల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ను ఎమ్మెల్యే అంబేద్కర్ సంఘం, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాంగ్రేస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటి డైరెక్టర్ వెంకట్ రెడ్డి,పిఎసిఎస్ మాజీ ఛైర్మన్ అంజయ్య,మాజీ ఎంపిటిసి శ్రీనివాసమూర్తి,మాజీ సర్పంచ్ పయ్యవుల రమేష్,మాజీ ఉప సర్పంచ్ పాల్గొన్నారు.