01-08-2025 01:31:02 AM
- అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
- పదవీ విరమణ పొందిన 18 మందికి ఆత్మీయ సత్కారం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివని అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 18 మంది అధికారులు, ఉద్యోగులకు అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్, అదనపు కమిషనర్లు వేణు గోపాల్, గీతా రాధిక, సీపీఆర్వో మహమ్మద్ ముర్తుజా, పీఆర్వో మామిండ్ల దశరథంలతో కలిసి శాలువా, పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్లను బహుకరించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి తాము అందించిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పదవీ విరమణ పొందుతు న్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, విరమణ పొందిన వారు వారి కుటుం బ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురా రోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు.
పదవీ విరమణ పొందిన వారు
చీఫ్ ఇంజినీర్ (ఎస్ఎన్డీపీ) ఎం కోటేశ్వరరావు, సూపరింటెండింగ్ ఇంజినీర్ బీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ డీ నరేందర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పీ రవీందర్, సూపరింటెండెంట్ బీ స్వామి, గేమ్స్ ఇన్ స్పెక్టర్ ఇంతైజ్ అహ్మద్, హెవీ వెహికల్ డ్రైవర్ మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్ కే మోహన్ రాజ్, ఆఫీస్ సబార్డినేట్ డీ నర్సింగ్ రావు, చైన్మెన్ ఎం యాదయ్య, పీహెచ్ వర్కర్ కే ముత్తమ్మ, కామాటి జీ పెంటయ్య, కామాటన్లు బాలమణి, యాదమ్మ, లక్ష్మీభాయి, లక్షమ్మ, మాలీలు కే ఎల్లయ్య, నర్సింహ ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఏఎంసీలు జీవన్ కుమార్, శారద, ఉన్నత శ్రేణి సహాయకులు రోహిత్, సహఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.