17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

యువత పోరాటాలకు సిద్ధం కావాలి

09-11-2025 06:23 PM

ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెపూరి కొండలు..

చిలుకూరు: ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం యువత పోరాటాలకు సిద్ధం కావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు పిలుపునిచ్చారు. ఆదివారం చిలుకూరు మండల 11వ మహాసభ డిఎన్ భవన్లో సిపిఐ కార్యాలయంలో జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు ఏఐవైఎఫ్ జెండాను జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు ఆవిష్కరించి అనంతరం, చిలుకూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఏఐవైఎఫ్, మండల అధ్యక్షులుగా, అనంతుల రాము, ప్రధాన కార్యదర్శిగా కడారు మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ వజ్రపు శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ముష్కుల శ్రీనివాస్ రెడ్డి, పిల్లుట్ల జగదీష్, నెమ్మాది గురుస్వామి, సహాయ కార్యదర్శులుగా, మీసాల సాయి, పిల్లుట్ల భాస్కర్, కాంపాటి రంజిత్, పాశం గోపి, కోశాధికారి కీసర గాంధీ, కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి, మండవ వెంకటేశ్వర్లు, షేక్ సాయి బల్లి, కాంపాటి వెంకటయ్య, కొండ కోటయ్య, పాల్గొన్నారు.