శ్రీశైలం హైవేపై బైక్ ప్రమాదం: యువకుడు స్పాట్ డెడ్
14-08-2026 10:20 AM
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై(Hyderabad-Srisailam Highway) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం, హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివ యాదవ్ అనే వ్యక్తి రోడ్డుపై పడిపోగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడిపై నుంచి దూసుకెళ్లడంతో థండ్రాకు చెందిన శివ యాదవ్ అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులను నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.






