11-05-2025 06:25:33 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో స్థానిక పెద్దమ్మ దేవాలయంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల (ZPHS) 1994-95 విద్యార్థులు Get Togedher "పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక" ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పండరి నాథ్ గురువు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... అలనాటి విషయాలు గుర్తుకు చేసుకుంటూ, వారు ప్రస్తుతం చేస్తున్న పనిని మరియు ఇతర విషయాలను అందరితో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాగారపు శేఖర్,కడారి రమేష్,బొమ్మెర శ్రీనివాస్, పాలకుర్తి శేఖర్,బీసు సతీష్,పబ్బ ప్రవీణ్,పన్యాల శ్రీనివాస్ రెడ్ది,లింగ హరి,పన్యాల రవీందర్ రెడ్ది,యార నాగభూషణం,ఎర్ర సంతోష్, మల్లబోయిన రాజు, చెన్నుగారి నర్సింలు, సిరిమల్లె నర్సింలు, చిట్యాల శ్రీనివాస్ రెడ్ది, విపుల్, సునీల్, అబ్రబోయిన రాజేందర్, శ్యామల గోపాల్, గొర్ల రాజు, మెంగని రవి తదితరులు పాల్గొన్నారు.