17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వరంగల్ సభకు 3 వేల బస్సులు

08-04-2025 01:42 AM

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రూ.8 కోట్ల చెక్ అందించిన బీఆర్‌ఎస్ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్‌లో తమ పార్టీ తలపెట్టిన రజతోత్సవ సభకు ప్రజలను తరలించేం దుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వస్తున్నారని, వారి కోసం తమకు 3 వేల బస్సులు అవసరమవుతాయని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. బస్సుల ఏర్పాటుకు అవసరమయ్యే రూ.8 కోట్ల చెక్‌ను ఎండీకి అందజేశారు. సజ్జనార్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ సీనియర్‌నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగా బాలు, విజయకుమార్ ఉన్నారు.