23 June, 2026 | 10:14 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

పిడుగు పడి 20 మేకలు మృతి

18-04-2025 12:47 AM

జహీరాబాద్, ఏప్రిల్ 17 : జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం దాదాపు మూడు గంటల ప్రాంతంలో విపరీతమైన ఈదురు గాలులతో పాటు వర్షం కురిసింది.

ఈదురు గాలితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన మేకలను తోలుకొని అడవిలో మేపుతుండగా పిడుగు పడినట్లు తెలిపారు. ఈ శబ్దానికి తన 20 మేకలు చనిపోయాయని, తన జీవనాధారం మేకలపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వం వెంటనే తనను ఆదుకోవాలని బాలయ్య బోరునవిలపించారు.