15 March, 2026 | 9:11 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పిడుగు పడి 20 మేకలు మృతి

18-04-2025 12:47 AM

జహీరాబాద్, ఏప్రిల్ 17 : జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం దాదాపు మూడు గంటల ప్రాంతంలో విపరీతమైన ఈదురు గాలులతో పాటు వర్షం కురిసింది.

ఈదురు గాలితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన మేకలను తోలుకొని అడవిలో మేపుతుండగా పిడుగు పడినట్లు తెలిపారు. ఈ శబ్దానికి తన 20 మేకలు చనిపోయాయని, తన జీవనాధారం మేకలపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వం వెంటనే తనను ఆదుకోవాలని బాలయ్య బోరునవిలపించారు.