09-04-2025 02:15:44 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 8, (విజయ క్రాంతి): పార ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించడంతోపాటు భారత ప్రభుత్వ అర్జున అవార్డు పొందిన తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సమీప బంధువులకి వచ్చిన దీప్తి జీవాంజినీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నామిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్య సలహాదారు మైస శ్రీనివాసులు ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న దీప్తి ఆత్మస్థైర్యం కోల్పోకుండా అంచలంచలుగా ఎదుగుతూ అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపి జపాన్లో జరిగిన పారా ఒలంపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని దీప్తి నిరూపించారని, దీప్తి స్పూర్తితో యువత క్రీడారంగంలో రాణించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్, మైస నాగయ్య, గూడూరు నాగేశ్వరరావు, దేవుడి మధుసూదన్ రెడ్డి, కుంజా రాంబాబు, వెంకటేశ్వర్లు, శ్యామ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.