09-04-2025 02:16:33 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బిజేపి, రాజ్యాంగ స్ఫూర్తిని, అవమాన పరుస్తూ మోడీ పాలనా సాగిస్తోంది.
రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటూ హనుమకొండ జిల్ల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 7, 9,10,11,29 వ డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాగన్నదర్వాజ నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పాపయ్యపేట జంక్షన్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ వారసత్వం, విలువలను కాపాడటానికి, దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలను ఐక్యత, సామాజిక న్యాయం సందేశంతో అనుసంధానించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరిచిన బిజేపిపార్టీ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్, జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు.
నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్. చీకటి శారద ఆనంద్, నెక్కొండ కల్పన కిషన్, విజయలక్ష్మి సురేందర్, మాజీ కార్పొరేటర్లు నసీం జాహాన్, నాగరాజు, బుద్ధ జగన్, పులి రాజు, అలువల కార్తీక్, బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, మహమ్మద్ జాఫర్, ఎస్. కుమార్ యాదవ్, సైండ్ల శ్రీకాంత్, మహమ్మద్ నసీర్, హరిసింగ్, బొమ్మతి విక్రం, గుంటి స్వప్న, డి. ప్రణయ్ దీప్, నాగ సోమేశ్వర్, మహమ్మద్ ఖుర్షీద్ , మహమ్మద్ యాకుబ్, బి. రామకృష్ణ, వినయ్, మాడిశెట్టి సతీష్, మంద రాకేశ్, పల్లం రమేష్ , రావుల మధు, ఎల్లయ్య, జావీద్, ఆజాద్ సింగ్, అయేషా నస్రీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు