21-07-2025 12:11:43 AM
మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి, సీఐ సతీష్ రెడ్డి
హాలియా, జూలై 20 : ఉచిత వైద్య శిబిరంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ,హాలియా సీఐ దేవి రెడ్డి సతీష్ రెడ్డి లు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని ఆదిత్య కేర్ హాస్పిటల్ లో నల్గొండ నిమ్స్ హాస్పిటల్, హాలియా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ట్రో, లివర్, సర్జరీల వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శిబిరంలో 600 మంది కి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైబ్రో లివర్ స్కాన్ , అల్ట్రా సౌండ్ స్కాన్ తదితర వైద్య పరీక్షలను నిర్వహించారు.
ఆదిత్య కేర్ ఎండి. డాక్టర్ నులక రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ గుండా కృష్ణమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ బాధ్యులు చిట్టిపోలు యాదగిరి, నులక వెంకట్ రెడ్డి, నిమ్మల లక్ష్మారెడ్డి వీరమల్ల శ్రీనివాస్, పేలపూడి బాలకృష్ణ, సక్రూనాయక్, చీదళ్ల లింగయ్య, డాక్టర్లు కీర్తి రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పాల్వాయి వెంకటరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నీరజ, సుధా, అంకుర్, శ్రీనివాస్, రిక్కల దనుంజయరెడ్డి, చెన్ను వీరారెడ్డి, మధు పాల్గొన్నారు.