21-07-2025 01:55:10 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. దాదాపు 5,000 మంది నిరుద్యోగులు మేళాకు తరలివచ్చారు. 85 మల్టీ నేషనల్ కంపెనీలు, 3000పై చిలుకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఎం.టెక్, పీజీ, విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకున్నారు. నిరుద్యోగులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో సెల్ఫీల కోసం ఆసక్తి చూపారు. భోజనం వసతి కల్పించారు.