21-07-2025 02:57:10 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారు ఆయన దీవించినట్లు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వెల్లడించారు.