calender_icon.png 7 June, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసాయిదా తప్పుల తడక!

05-06-2025 01:06:33 AM

- అమీబా ఆకృతిలో డివిజన్ల విభజన

- వ్యక్తమవుతున్న అభ్యంతరాలు

- నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

కరీంనగర్, జూన్ 4 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో శివారు గ్రా మాల విలీన అనంతరం డివిజన్లను పునర్విభజిస్తూ ముసాయిదా ప్రతిపాదనలను ము న్సిపల్ శాఖ విడుదల చేసింది. గతంలో ఉ న్న 60 డివిజన్లను 66కు పెంచి పునర్విభజన చేస్తూ మున్సిపల్ శాఖ ముసాయిదాను విడుదల చేసింది.

అయితే ఈ పునర్విభజనలో తప్పులు దొర్లాయంటూ మాజీ కార్పొ రేటర్లతోపాటు స్థానిక నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అమీబా ఆకృతిలో డివిజన్లను పునర్విభజించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరించనున్నారు. ఈ మేరకు భారీ సంఖ్యలో పలు డివిజన్ల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వీకరించిన అ భ్యంతరాలను 12 నుంచి 16 వరకు పరిశీలిస్తారు. ఈ నెల 17, 18 తేదీల్లో డివిజన్ల వి భజనకు కలెక్టర్ అనుమతి తీసుకుంటారు.

19న తిరిగి ముసాయిదా జాబితాను సీడీఎంఏకు పంపిస్తారు. 20వ తేదీన సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. ఈ నెల 21న డివిజన్ల ఫైనల్ జాబితాను విడుదల చేస్తారు. అభ్యంతరాలు భారీ సంఖ్యలో వ్యక్తమవుతున్నందున డివిజన్ల పునర్విభజనలో మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 4800 నుండి 5200 మంది ఓటర్ల సంఖ్యను ఆధారం చేసుకుని పునర్విభజించారు. అయితే ఈ పునర్విభజనలో 62వ డివిజన్లో 8 వేల పైచిలుకు ఓట్లు కనిపిస్తుండగా, 63వ డివిజన్లో కేవలం 2వేల పైచిలుకు ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. గతంలో విలీనమైన రేకుర్తిని తీసుకుంటే పూర్వం 18, 19 డివిజన్లు ఉండగా ఈ డివిజన్లను అర్థంపర్థం లేకుండా మార్చారు.

ప్రస్తుతం ఉన్న 18వ డివిజన్ ను 43వ డివిజన్ గా మార్చారు. అయితే రేకుర్తి గ్రీన్ హోమ్స్, వాల్యు హోమ్స్, ముదిరాజ్ కాలనీ, గౌడ్స్ కాలనీ, షేఖాన్ నగర్, ద్వారకానగర్, కృష్ణనగర్లు ఉండగా ప్రస్తుతం కంటి దవాఖానా, లక్ష్మీ నరసింహస్వామి కాలనీలను ఇందులో కలుపుతూ వాటికి సంబంధం లేకుండా, కలిసి లే కుండా ఉన్న హనుమాన్ నగర్, టీచర్స్ కాలనీ, భగత్ నగర్, హరిహరనగర్, శాతవాహన కాలనీలను కలిపారు.

సాలేహ్ నగర్, హనుమాన్ నగర్ లకు ఏమాత్రం సంబంధం ఉండదు. శాతవాహన కాలనీ, కంటి దవాఖానాకు సంబంధం ఉండదు. అధికారుల తప్పిదం, అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పాత 17వ డివిజన్ పరిధిలోని కొత్తయాస్వా డ, శ్రీరాంనగర్ కాలనీ, విద్యనగర్లను పూర్తి గా విభజించారు. శ్రీరాంనగరాకాలనీ యా స్వాడకు సంబంధం లేకుండా హిందుపూర్లో కలిపారు. ఇలా చాలా డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్విభజించారు. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు కరీంనగర్ రూరల్ మండలం

బొమ్మకల్, దుర్శేడు, గోపాల్పూర్, కొత్తపల్లి మం డలంలోని చింతకుంట, మల్కా పూర్, లక్ష్మీపూర్ గ్రామాలను కార్పొరేషన్లో విలీనమైన విషయం తెలిసిందే. 2018లో అల్గునూర్, సదాశివపల్లి, పద్మానగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి, వల్లంపహాడ్ వంటి 8 గ్రామ పంచాయతీ లను విలీనం చేయడం ద్వారా డివిజన్ల సం ఖ్యను 50 నుంచి 60కి పెంచగా.. తాజాగా ఒక పట్టణం, ఆరు గ్రామాల విలీనంతో డివిజన్ల సంఖ్యను 66కు పెంచారు.  అయితే కొత్త డివిజన్ ల పై కంటే పాత డివిజన్ ల విబహణపై అబ్యఅంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

పారిశుధ్య పనులు చేసేందుకు కార్మికులకు అనుగుణంగా డివిజన్లు ఉండవలసి ఉంటుంది. ఆనుకొని ఉన్న కాలనీలు, రోడ్డు మార్గాన్ని దృష్టిలో ఉంచుకుని పునర్విభజన చేస్తే అభ్యంతరాలు ఉండకపోయేవి. అయితే అధికారుల అవగాహన రాహిత్యం వలన ఒక కాలనీ, ఒక కాలనీకి రోడ్డు సంబంధం లేని ప్రాంతాలను ఒక డివిజన్ గా ఏర్పాటు చేయడం అభ్యంతరాలకు తావిస్తున్నది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుండగా భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యేఅవకాశంఉంది.