05-06-2025 01:05:40 AM
చెలరేగుతున్న ఇసుక మాఫియా
చూసీ చూడనట్టు అధికారుల వ్యవహారం
బూర్గంపాడు, జూన్ 4 (విజయక్రాంతి): అనుమతుల్లేకుండా ఒకరు.. అనుమతుల పే రుతో మరికొందరు పట్టపగలే సహజవనరులను దోచుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బూర్గంపాడు మండలంలో ప్రవహించే గో దావరి,కిన్నెరసాని వాగు నుంచి నిర్విరామంగా ఇసుక దోపిడీ జరుగుతోంది.
ఈ గో దావరి, కిన్నెరసాని వాగుల నుంచి మండలంలోని పలు ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా ఇసుక దందా మూ డు ‘పువ్వులు.. ఆరు కాయలు’గా సాగుతోం ది.
అధికార పార్టీకి చెందిన నాయకులే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా మొదలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గోదావరి, కిన్నెరసాని వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అధికారపార్టీ నేతల అండ..!
మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల,గ్రామ స్థాయిలోని కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇసుక రవాణాలో భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూ ర్గంపాడు మండలంలో ఇసుక అక్ర మ రవాణాను ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. పర్మిషన్ లేకున్నా ఇసుక ను తరలిస్తున్నారని ప్రశ్నిస్తే, అధికారుల అం డదండలు ఉన్నాయని, ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అంటూ ఎదురు దాడికి దిగుతు న్న సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామా ల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా మైనింగ్,రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టపగలే అతివే గంతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భ యాందోళనకు గురవుతున్నారు. ఇసుక దం దాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు.
బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని వాగు ఆనుకుని ప్రవహించే ఉప్పసాక,పినపాక పట్టి నగర్, బుడ్డగూడెం,సోంపల్లి, గోదావరి పరీవాహక ప్రాంతాలైనా ఇరవెండి,సారపాక, తాళ్ళగొమ్మూరు, రెడ్డిపాలెం గొమ్మూ రు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.
అనుమతుల మాటున దందా..!
పోలీసులు,అధికారులు ఎవరైనా అడిగితే తెచ్చుకున్న అనుమతులు చూపుతున్నారు. అనుమతులు పొందిన ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉదయం 9:30 గంటల నుంచి సా యంత్రం 5:30 గంటల వరకే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఉదయం 7 గంటల నుంచే రవాణా మొదలవుతోంది. ఎన్ని ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి చేరవేస్తున్నారన్న దీనిపై అధికారుల నిఘా కరవైంది.
దీంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. అనుమతుల పేరుతో టిప్పర్లలో ఇసుక రవాణా ఒక ఎత్తయితే.. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగుల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలించడం మరో ఎత్తు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు.
ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ శిరీష అన్నారు. పలు అభివృద్ధి పనుల నిమిత్తం ఇసుక కూపన్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.వాగుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు.
తహసీల్దార్ శిరీష