12 March, 2026 | 6:40 AM

కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్ర

10-06-2025 01:13 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ విమర్శలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒకే ఏజెండాతో తమ పార్టీ అధినేత కెసీఆర్‌ను బద్నాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమష్టిగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్‌తో పాటు హరీశ్‌రావు స్పష్టం చేశారన్నారు. కేసీఆర్ కొత్తగా చెప్పేదేమీ ఉండదంటూ సోమవారం కేటీఆర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కాళేశ్వరం అంశంలో దాచాల్సిందేమీ లేదన్నారు.