10-06-2025 01:12:26 AM
- నేటి నుంచే ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కా రానికి కాంగ్రెస్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, మంగళవారం నుంచి గాంధీభవన్లో ‘అందుబాటులో ప్రజా ప్రతిని ధులు’ అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది.
పీసీసీ అధ్యక్షుడు మహే ష్కుమార్గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి రోజు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు నిర్వ హించనున్నారు. మొదట రోజుకు ఇద్దరు కార్పోరేషన్ చైర్మన్లు ఉద యం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు గాంధీభవన్లో అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వంచే పరిష్కరింపజేసేందుకు కృషి చేస్తారు.
కార్పోరేషన్ చైర్మన్ల తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా గాంధీభవన్లో ఉండి ప్రజల నుంచి వినతులు తీసుకుని అవి పరిష్కారమయ్యేలా చూడనున్నారు. నేడు వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రజల నుంచి వినతులు తీసుకోనున్నారు.