15 June, 2026 | 11:44 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

30-12-2025 01:34 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, డిసెంబర్ 29(విజయక్రాంతి) :అక్రమ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్ బి, ఇంజనీరింగ్, పోలీస్, ఫారెస్ట్, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా ఇసుక కొనుగోలు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సాండ్ బజార్లో నిలవ చేస్తామన్నారు.

ఇప్పటికే నర్సాపూర్లో సాండ్ బజార్ ప్రారంభించడం జరిగిందని, మెదక్ లో తొందరలో ప్రారంభించనున్నామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ జరగకూడదని, మైనింగ్ జరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంటే తెలిపితే చట్టాలకు అనుగుణంగా తక్షణం కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. అక్రమ ఇసుక మైనింగ్ ఏరియాలలో సీసీటీవీ కెమెరాల ద్వారా పటిష్ట పర్యవేక్షణ చేపడుతున్నట్లు వివరించారు. వాటిని ఆధారాలుగా చేసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ నుంచి ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం ఉందన్నారు.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహించి అటువంటి వారికి చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయాలన్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందని ఆ ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్‌ఓ భుజంగరావు, ఆర్డిఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, డిఆర్డీఓ శ్రీనివాసరావు,ఈడి మైన్స్ సంజయ్ కుమార్, డీఎస్సీ ప్రసన్నకుమార్, ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.